టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా టీమిండియా సూపర్-8 పోరుకు సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో ఆదివారం తలపడనుంది. ఈ పోరులో ఒక్క మార్పుతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అంచనా వేశాడు. అర్ష్దీప్ సింగ్ను బెంచ్కే పరిమితం చేసి.. అతడి స్థానంలో అక్షర్కు అవకాశం ఇవ్వొచ్చని తెలిపాడు. అలాగే, సుందర్ను కొనసాగించే ఛాన్స్ ఉందన్నాడు.