CTR: కుప్పం డీఎస్పీ కార్యాలయంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ శ్రీ పార్థసారథి కార్యాలయ సిబ్బందితో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి అంబేద్కర్ అందించిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. సమానత్వం, న్యాయం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు.