NDL: గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి గ్రామసభలు ముఖ్యమని తహసీల్దార్, ప్రత్యేక అధికారి పి. రమాదేవి ఇవాళ తెలిపారు. మహానంది స్వర్ణ సచివాలయంలో జరిగిన గ్రామసభలో పాల్గొని, మాట్లాడారు. ముందుగా డా. బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రమాదేవిని పంచాయతీ సెక్రెటరీ భాస్కర్, సిబ్బంది సన్మానించారు. గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.