NDL: ఆళ్లగడ్డ మండలం బత్తులూరు గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో పశుగ్రాస వాములు దగ్ధమై రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఘటన స్థలాన్ని రాష్ట్ర రైతు సంఘం నాయకులు టి.రామచంద్రుడు, శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అధికారులు విచారణ జరిపి రైతులకు అండగా నిలవాలని కోరారు.