KRNL: కోసిగి(మం) కందుకూరులో NTR భరోసా పెన్షన్ను ఇవాళ లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, మంత్రాలయం నియోజకవర్గ TDP ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు. పేదలు, వృద్ధులు, వికలాంగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.