మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లి సమీపంలో వెలసియున్న పురాతన గ్రామదేవత శ్రీ ముద్దసానమ్మ అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు భక్తులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాలతో పాటు సమీప పట్టణాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.