ప్రకాశం: ఒంగోలులోని పెర్నమిట్టలో ఘరానా చోరీ జరిగింది. మంగళవారం అర్ధరాత్రి శ్రీనివాసులు ఇంటిలో దొంగలు ప్రవేశించి 4 గ్రాముల బంగారం రూ.10 వేలు నగదుతో పాటు ఇంటి ముందు ఉన్న నీటి మోటార్నీ దొంగలు అపహరించి తీసుకువెళ్లారు. పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లిన శ్రీనివాసులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.