AKP: ఎస్ఈజెడ్ అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో బార్క్ భూసేకరణకు సంబంధించి 15 ఏళ్లయిన నిర్వాసితులకు ఇంతవరకు పరిహారం చెల్లించలేదని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ.. నిర్వాసితులకు ఆర్.ఆర్. ప్యాకేజ్లో కాలనీలు ఇప్పటివరకు సిద్ధం కాకపోవడంతో వారిని తరలించలేకపోతున్నామన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.