CTR: బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లె సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బైరెడ్డిపల్లి మండలం బాపలనత్తం గ్రామానికి చెందిన పురుషోత్తం అనే యువకుడు స్వల్ప అస్వస్థతకు గురి కాగా స్థానికులు బైరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.