GNTR: సీఆర్డీఏ అదనపు కమిషనర్ ఏ. భార్గవతేజ గురువారం తుళ్లూరు మండలంలోని మోదులింగాయపాలెం, మల్కాపురం, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో పర్యటించారు. నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు లేఅవుట్ల ఏర్పాటు ప్రక్రియను సీఆర్డీఏ చేపట్టింది. అందుబాటులో ఉన్న భూములను గుర్తించే దిశగా పర్యటన సాగింది.