సత్యసాయి: పరిగిలో YCP 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.