KRNL: ఆదోని(మం) చిన్న పెండేకల్ గ్రామంలోని జడ్పీ పాఠశాలలో శనివారం హెచ్ఎం శేకన్న ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శేకన్న మాట్లాడుతూ.. అన్ని శాస్త్రాలకు సైన్స్ తల్లిలాంటిదని తెలిపారు. మనిషి జీవితంలో సైన్స్ ఎంతో ప్రాముఖమైనదని తెలిపారు.