KDP: ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలుగుదేశం మహిళా ప్రజాప్రతినిధుల బృందం రాజధానికి చేరుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ఈ బృందంలో కడప ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రెడ్డెప్పగారి మాధవి పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్లో జరిగే చర్చలను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.