తిరుపతి: జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ శాఖ గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజలకు భద్రతపై అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలో నిన్న దొంగతనాల నివారణ, సైబర్ నేరాలు, మహిళల భద్రత, ట్రాఫిక్ నియమాలపై సూచనలు ఇచ్చారు. అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను సూచించారు.