KKD: ప్రజలను ఎలా మభ్య పెట్టాలో తెలిసిన నాయకుడు సీఎం చంద్రబాబు అని కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. శనివారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి ఆలోచించకుండా విజన్- 2047 అంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు.