BPT: కారంచేడు మండలం ఆదిపూడి గ్రామానికి చెందిన కొమ్మినేని చంద్రశేఖర్ పోగొట్టుకున్న రెడ్మీ మొబైల్ ఫోన్ను కారంచేడు పోలీసులు గుర్తించి బుధవారం బాధితుడికి తిరిగి అప్పగించారు. 2024 నవంబర్ 9న ఫోన్ పోగొట్టుకోగా, నవంబర్ 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెక్నాలజీతో ఫోన్ను గుర్తించినట్లు ఎస్సై ఖాదర్ బాషా తెలిపారు.