NTR: గంపలగూడెం మండలం నెమలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంఈవో నరసింహారావు సోమవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లు, తదితర రికార్డులు పరిశీలించారు. తదనంతరం 10వ తరగతి విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ.. పక్క ప్రణాళికతో చక్కగా చదువుకుంటూ, పబ్లిక్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.