BPT: అద్దంకి మండలం చక్రాయపాలెం నామ్ రహదారిపై గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నరసరావుపేట నుంచి మేదరమెట్ల వైపు వెళ్తున్న కారు, చక్రాయపాలెం మలుపు వద్ద అదుపుతప్పి ఎదురుగా వచ్చిన రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు.