ప్రకాశం: కనిగిరిలో పీఎం సూర్య ఘర్ పథకం కింద SC, ST కాలనీల సౌరీకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సౌర విద్యుత్ వినియోగంతో పేద కుటుంబాలకు విద్యుత్ ఖర్చులు తగ్గి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ,పార్టీ నాయకులు పాల్గొన్నారు.