GNTR: గుంటూరులో గురువారం జరిగిన ‘మా-ఏపి’ యూనియన్ సమావేశంలో దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల నటీనటులు, సాంకేతిక నిపుణుల ఉపాధి దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. AI వినియోగంపై సెన్సార్ బోర్డు తక్షణమే స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.