E.G: భవన నిర్మాణ కార్మికులు వెంటనే కార్మిక సంక్షేమ బోర్డులో నమోదు చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని ఐఎఫ్టీయూ ఉమ్మడి తూ.గో జిల్లా సహాయ కార్యదర్శి బి. సిద్ధూ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 1, 2026 నుంచి భవన ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ పథకాలను తిరిగి అమల్లోకి తీసుకువచ్చిందన్నారు.