అన్నమయ్య: రాయచోటి పట్టణంలో బినామీ పేర్లతో ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తున్న మున్సిపాలిటీ ఉద్యోగి హరిపై విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ డిమాండ్ చేశారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.