VZM: దత్తిరాజేరు మండలం ఎం. లింగాలవలసలో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన కిలారి నాగ, రామారావు, సింగరావ్ కన్నయ్యలకు చెందిన మూడు గడ్డివాములు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ. 80 వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.