SKLM: పలాస ఎమ్మెల్యే శిరీష పలాస నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, ప్రజారోగ్యం వంటి కీలక అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. వేసవిలో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.