విజయనగరం ఘోష ఆసుపత్రిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేత్కర్ జయంతిని పురస్కరించుకుని బంగారమ్మ చారిటబుల్ ట్రస్ట్, మాతృభూమి సేవా సంఘం మానవీయత చాటుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 250 మంది గర్భిణీలు, బాలింతలకు బిస్కట్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీశెట్టి బాజ్జీ, భోగవిల్లి వెంకట రమణ పాల్గొన్నారు.