అన్నమయ్య: ఎన్నికల ముందు ప్రజలకు హామీలతో మాయ చూపించి అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెట్టడం కూటమి ప్రభుత్వానికి అలవాటైపోయిందని అన్నమయ్య కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుల భాస్కర్ విమర్శించారు. కేవలం ఏడాది పాలనలోనే తాము సుపరిపాలన అందించామని చెప్పుకోవడం ప్రజలను మోసగించే ప్రయత్నం మాత్రమేనని ఆయన ధ్వజమెత్తారు.