ASR: ఎల్-నినో కారణంగా వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడంతో గిరి ప్రాంత పంటలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి తెలిపారు. గురువారం ఎల్-నినో వాతావరణ ప్రభావం, ముందస్తు చర్యలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తక్కువ కాలంలో పండే, తక్కువ నీటితో పెరిగే పంటలను ఎంచుకోవాలని నిపుణులు సూచించారు.