E.G: నూతన ఎస్ఐ వి. వినయప్రతాప్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ సీసీఎస్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన, ఎస్ఐ రాంకుమార్ నుంచి చార్జ్ తీసుకున్నారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నేరాల నియంత్రణకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.