KRNL: చిప్పగిరి మండలం కుందనగుర్తిలో డాక్టర్ అప్రోజ్ ఆధ్వర్యంలో ఇవాళ చంద్రన్న సంచార వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు బీపీ, షుగర్ తదితర సాధారణ ఆరోగ్య పరిక్షలు చేశారు. అవసరమైన వారికి తగిన మందులు ఉచితంగా అందజేశారు. శిబిరం సాయంత్రం వరకు కొనసాగుతుందని, గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సూచించారు.