ATP: మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం) పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న చారిత్రక ఘట్టానికి సాక్షులుగా నిలిచేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత ఢిల్లీ వెళ్లారు. ఇతర మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె దేశ రాజధానికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఎంపీ లావు కృష్ణదేవరాయలు నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు ఆమె హాజరయ్యారు.