కోనసీమ: రామచంద్రపురం అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరారు. శుక్రవారం అమరావతిలో పవన్ కళ్యాణ్ను మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొత్త సిమెంట్ రోడ్ల నిర్మాణానికి, స్మశాన వాటికల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు.