SKLM: అకాల వర్షానికి నష్టపోయిన టమాటా రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అశోక్ బాబు అన్నారు. శనివారం కంచిలి M బెంకిలి, జింకి భద్ర, పలాసపురం పంచాయతీల పరిధిలో నష్టం జరిగిన టమాటా పంట పొలాలను పరిశీలించారు. సమస్యను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చర్యలు చేపడతామన్నారు.