NLR: కందుకూరు నియోజకవర్గంలో త్వరలో 24 గంటల త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ సహకారంతో అమలు చేస్తున్న ఆర్ఎఎస్ఎస్ పథకాన్ని ఎమ్మెల్యే ఇంటూరి సొంత గ్రామమైన బడేవారిపాలెంలో ఇవాళ ప్రారంభించారు. దీనితో వలేటివారిపాలెం మండలం పోకూరు సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు.