E.G: రాజమండ్రి మెయిన్ రోడ్డులోని చిన్న మసీదులో మంగళవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీల రక్షణ, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. రంజాన్ పవిత్రతను కొనియాడుతూ, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.