VZM: బొబ్బిలి పట్టణంలోని కంచరవీధిలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం పూలంగి సేవ నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. పవిత్ర ధనుర్మాసం సందర్బంగా శనివారం వేకువజాము నుంచి స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. అనంతరం స్వామికి పూలంగి సేవ జరిపిస్తామని వెల్లడించారు.