ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత కళ్యాణదుర్గం మండలం యర్రంపల్లి గ్రామానికి వెళ్లి హనుమంతరాయ చౌదరి భౌతిక దేహానికి టీడీపీ జెండా కప్పి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు.