ASR: వరరామచంద్రపురం మండలం శబరి బ్రిడ్జ్ సమీపంలోని కమ్మరివాడ వద్ద గురువారం ఉదయం శబరి నది ఒడ్డున ఓ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని ఎస్సై సాధిక్ తెలిపారు.