W.G: రాష్ట్ర శాసనసభ సందర్శనకు తణుకు కొండేపాటి సరోజినీ దేవి మహిళా కళాశాల విద్యార్థినిలు వెళ్లారు. శాసనసభను సందర్శించి సభ విశిష్టత, ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని అధికారులు, ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులు తెలుసుకున్నారు. చదువుకునే వయస్సులోనే ఇటువంటి పర్యటనల ద్వారా విద్యార్థులకు ప్రజాస్వామ్యంపై అవగాహన ఏర్పడుతుందన్నారు.