PLD: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన సేవలు ఆనిర్వచనీయమని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రహదారిలోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మల్లికార్జున రావుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన నాయకులు పాల్గొన్నారు.