ATP: పామిడి సరస్వతి విద్యా మందిరం అభివృద్ధికి ఉమ్మడి అనంతపురం జిల్లా ఏడీసీసీ బ్యాంకు ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి భారీ విరాళం అందజేశారు. పాఠశాలలో నూతన గదుల నిర్మాణం, ఇతర మరమ్మతుల కోసం తన సొంత నిధులు రూ.50 వేలు విద్యా మందిరం బృందానికి అందజేసి ఉదారత చాటుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఆయనను దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించింది.