ELR: అంబేద్కర్ జయంతి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని చింతలపూడి ఎస్సై సతీష్ కుమార్ పేర్కొన్నారు. శనివారం రాత్రి మండలంలోని సీతానగరం గ్రామంలో అంబేద్కర్ కమిటీ సభ్యులకు ఆయన అవగాహన కల్పించారు. ప్రతి విగ్రహం వద్ద లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం, అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఊరేగింపులు సమయంలో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.