కడప ఎన్జీవో భవన్లో గురువారం జరిగిన సమావేశంలో జిల్లా జేఏసీ ఛైర్మన్గా బి. శ్రీనివాసులు, సెక్రటరీ జనరల్గా యూటీఎఫ్ నేత పాలెం మహేష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మహేష్ బాబు విమర్శించారు.పెండింగ్ సమస్యల పరిష్కారానికి జేఏసీ ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.