NDL: మహానంది మండలం గోపవరంలో మహానంది వ్యవసాయ కళాశాల విద్యార్థులు రెండో రోజు ఆదివారం గ్రామంలో పర్యటించారు. జాతీయ సేవా పథకం కార్యక్రమంలో భాగంగా గ్రామ ఆర్థిక సర్వేను నిర్వహించారు. రైతులతో కలిసి గ్రామ జనాభా వివరాలు, పంటల సరళి, పెట్టుబడి, రాబడి వ్యత్యాసాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో NSS అధికారులు డాక్టర్ ఉమామహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.