సత్యసాయి: ధర్మవరం పట్టణం 28వ వార్డులో నూతనంగా నిర్మించిన డ్రైనేజ్ కాలువకు పైకప్పులు లేకపోవడం చుట్టూ గ్రావెల్ పరచకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ధర్మవరం బీజేపీ నేత హరీష్ బాబు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. కాలువపై భద్రతా పైకప్పులు ఏర్పాటు చేసి, గ్రావెల్ పరిచే పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.