SKLM: నందిగాం(M) కొత్త అగ్రహారం గ్రామ సమీపంలో శుక్రవారం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గడ్డికుప్పలు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి గడ్డికుప్పలు కాలిపోవడంతో అలజడి నెలకొంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.