VZM: వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా బుధవారం తెర్లాం మండలంలోని గంగన్నపాడు గ్రామాన్ని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ గ్రామంలో నర్సిపల్లి వారి బంధ చెరువు ఓవర్ ఫ్లో కావడంతో గ్రామంలోని ప్రధాన వీధుల్లోనీటి ప్రవాహం కొనసాగుటుండటం గమనించిన కలెక్టర్ ఇరిగేషన్ ఏఈతో మాట్లాడి తక్షణం నీటి ప్రవాహం బయటకు పోయేవిధంగా చర్యలు తీసుకోవాల న్నారు.