ATP: శింగనమల మండలం వెస్ట్ నరసాపురంలో ఓ ప్రైవేట్ కంపెనీ తీరుపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయటి ప్రాంతాల నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి పంట పొలాల్లో దహనం చేస్తుండటంతో విషపూరిత పొగ వెలువడుతోంది. దీనివల్ల శ్వాసకోస ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.