సత్యసాయి: పెనుకొండలో ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు మహిళలతో భారీ సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్డీయే కూటమి నాయకులు తెలిపారు. శుక్రవారం టీడీపీ కన్వీనర్ శ్రీరాములు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరుకానున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.