CTR: రొంపిచర్ల వద్ద తిరుపతి-మదనపల్లె హైవేపై ఆదివారం రెండు బైకులు ఢీకొనడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. రొంపిచర్లకు చెందిన లతీఫ్ పీలేరులో మేస్త్రీ పని ముగించుకుని బైకుపై వస్తుండగా దారిలో మరో బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లతీఫ్కు తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.