WG: నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ యథావిధిగా ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నరసాపురం ఆర్డీవో దాసిరాజు తెలిపారు. డివిజన్లోని అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. సబ్ డివిజన్లోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులు, దరఖాస్తులను అందించాలని కోరారు.